Tuesday, October 13, 2009

శ్రీరస్తు- శుభమస్తు (పెళ్ళి పుస్తకం)

శ్రీరస్తు - శుభమస్తు శ్రీరస్తు - శుభమస్తు

శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం
ఇక ఆకారం దాల్చుతుంది కొత్తజీవితం !! శ్రీరస్తు!!

తలమీద చెయ్యివేసి ఒట్టుపెట్టినా
తాళిబొట్టు మెడను కట్టి బొట్టుపెట్టినా
సన్నెకల్లు తొక్కిన సప్తపదులు మెట్టినా
మనసు మనసు కలపడమే మంత్రం
అదియే పెళ్ళి తంతు పరమార్దం !! శ్రీరస్తు!!

అడుగడుగున తొలిపలుకులు గుర్తుచేసుకో
తడబడినా పొరబడినా నీ తప్పుదిద్దుకో
ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని
మసకేయని పున్నమిలా మనసు నిలపుకో !! శ్రీరసు!!

Thursday, July 23, 2009

గణఫతి పూజ


ప్రారంభములో సాగేది గణాధిపతి పూజ, దీన్నే గణపతి పూజ అని అంటారు. వైష్ణవులు అయితే విష్వక్సేన పూజ అంటారు.
శివాయ విష్ణు రూపాయ - శివరూపాయ విష్ణవే,
శివస్య హృదయం విష్ణుః - విష్ణో శ్చ హృదయగం శివః

అనే విషయాన్ని గమనెస్తే, శివకేశవ భేధమే లేదు కావున, రెండూ ఒకటే అవుతాయి. రోజు సంద్యావందనంలో ఈ శ్లోకాన్ని చదివి కూడా, బేధం ఉందని భావిస్తే, చెప్పేది ఏమీలేదు.

1) దేవీం వాచ మజనయంత దేవాః- అయం ముహుర్తః సుముహూర్తో అస్తు

2) య శ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వమంగళాl
తయో స్సంస్మరణా త్పుంసాం సర్వతో జయమంగలమ్ll

౩) శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్l
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేll
అని ఈ తీరుగా మంగల శ్లోకాలు వెడలుతాయి ప్రారంభములో, వరుసగా అర్దం చూద్దాం.

Thursday, July 16, 2009

కళ్యాణం కమనీయం.

కళ్యాణం! అనే పదంలో ఎంతో మధురంగా వుంటుంది. ప్రతీ మనిషి జీవితంలోను ఒకే ఒక్కసారి జరిగే ఈ వేడ్క జీవితానికంతటికీ మరచిపోలేని మధురమైన స్మృతిగా మిగిలిపోతుంది. ఈ అద్బ్జుత క్షణం ఒక అసాధరణమైన, అనుభూతి. ఈకళ్యాణ్ ఘఢియ తరువాతే మనిషి జీవితానికి ఒక పరిపూర్ణత లభిస్తుంది. భాద్యత యుతమైన పౌరుడిగా కుటుంబంలోను, అటు సంఘములోను కూడా ఒక గుర్తింపును కలగ జేసేది కళ్యాణమే!! ఎన్నెన్నో సుఖాలు, కష్త్టాలు, ఆనందాలు, అనుభూతులు వీటన్నింటిని ఒకరికొకరు సమానంగా పంచుకిని జీవన గమ్యాన్ని సాగించడమే ఈ కళ్యాణంవెనుక ఉన్న పరమార్హ్దం. ఇందులో చదివే ప్రతి వేద మంత్రాక్షరం వెనుక ఉన్న అర్ధమూ ఇదే!!! వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా జరిగే పెళ్ళీకి ఏయే దేవతలొస్తారో, వారివెంట ఎవరొస్తారో తెలుసుకుందాం.!!!
సరేనా అయితె ఇప్పుడుకాదు తరువాత post లో నుండి .

Tuesday, July 14, 2009

భీజక్షేత్ర ప్ర్రాధాన్యం


భీజం అంటే విత్తనం. క్షేత్రము అంటే భూమి. పురుషుణ్ణి విత్తనంతోను. స్త్రీని క్షేత్ర,ము గాను పోల్చారు. ప్రాచీనులు .భూమి , భూమిగా ఎంతకాలమైన ఉండగలదు. కాని, విత్తనం ఎంతోకాలము తనలో ఉన్న ఉత్పాదకశక్థితో (మొక్కగా పుట్టగల శక్తి కలిగి)ఉండలేదు.
ఎన్ని విధాలుగా మహా దుర్మార్గులెందరో భాధపెట్టినను , సహించే లక్షణము భూమిది. భరించలేని స్తితిలో భూదేవి శ్రీమహావిష్ణువు వద్దకు మొరపెట్టుకోటానికి వెళ్ళి మరికొంతకాలము ఆగాలని ఆయనంటే కూడా-ఆగేంతటి సహనశక్తి కలది.

ఇక ఎదురుతిరిగితే (భూకంపము) కొన్ని కోట్ల ప్రజలని క్షణాలలో ఎందుకు కాకూండా చేయగలదు. స్త్రీని భూమితో పోల్చడానికి కారణము ఆమె సహనశీలతా, నిస్సహాయ స్థితిలో ఆమె విజృంభింస్తుంది.

విత్తనాన్ని మొక్కగా మారుస్తుంది భూమి, తనలోని నీటిని అందించి పెద్దగా చేస్తుంది. వృక్షముగా మారుస్తుంది కూడా. ఇలా వృక్షానికి ఆధారమైనది భూమి. అందుకే తన నుండి పెరిగిన వృక్షానైనా, భూకంపం వచ్చినపుడు తనలో లయం చేసుకుంటుంది. భూమి.

ఆడదై పుట్టడం కంటే, అడవిలో మానై పుట్టడం మేలు అనే సామెత ఉంది. "ఆడది" అంటే ఆధార భూతురాలు. అన్నిటి భాద్యతనీ వహించేది అని అర్ధము.

మానుగా పుట్టడంఅంటే, ఆధారంగా భూమి ఉండగా, ఆ ఆధారాన్ని బట్టి పెరగడం ( ఆధేయవస్తువు) కదా!ఆదారంగా వుండటంకంటే ఆధారపడటం మేలని భావం. క్షేత్రమైన స్త్రీకి ప్రాదాన్యము కావున, విధురునికి తండ్రిని బట్టి ( వ్యాసుడు) బ్రాహ్మణ జన్మకాకపోయినది. అలాగే రావణునికి, తండ్రిదైన (పులస్య) బ్రాహ్మణ జన్మ కాక, తల్లి కైకసిని బట్ట్టి క్ష్తత్రీయత్వం వచ్చింది. ఇంతటి ప్రాధాన్యం స్త్రీకి వుందికావునే కన్యనివరించటానికి ఇన్ని ఆంక్షలు అన్నీ స్త్రీ కే పెట్టారు.

ఎంతో కష్టపడి, పొలాన్ని కొని, వర్షం వచ్చేవరకు ఎదురు చూచి వర్షం పడ్డాక భూమిని పదును ఛేసి, చివరికి వెర్రివిత్తనాన్నిఎవరూ ఎలా వేయరో, అలాగే భగవద్ ప్రసాదంగా కుతురుని కని, పెంచి పెద్దచేసి, వెర్రి నాగన్నకి అంటగట్టంకదా! అందుకని వరుని తరుపువారికి ఈ తంతు కన్యా-వరుణమైతే , వదువు తరుపు వారికి కన్యా+ఆవరణ మౌతుందిట.
ఇలా కన్యని వరించి చేసుకున్నాక, ముహుర్తాన్ని నిశ్చయం చేసుకుంటారు. ఇక్కడి నుండి "వివాహం" ప్రారంభమౌతుంది. దీనిలో ముఖ్యమైన ఘట్టాలూ, మంత్రాలూ, అర్ఢమూ,వివరించుకుంటూ వెళదాము మరి.

Tuesday, May 19, 2009

స్త్రీ కే ఇన్ని పరీక్షలా ?

`కన్య' ని అన్ని విధాలుగా పరీక్షించి, ఇన్ని పరీక్షలలోను నెగ్గితేనే గ్రహించాలా? అసలు స్త్రీకే ఇన్ని పరిక్షలెందుకు? పురుషుడికి లేవా? అతడెలా ఉన్నా పెళ్లి చేసుకోవచ్చు కాని, కన్యని మాత్రం ఈ అవలక్షనాలున్నది కానే కారాదా? ఇవన్నీ పురుషులు వ్రాసి ఉండడం వలీ, పక్షపాత బుద్దితో ఇలా రాసి వుంటారా? అని కొందరు మేధావులు భావిస్తూ వాపోతూ వుంటారు కూడా.
ఈ కాలంలో ఇదేమీ విచిత్రమో తెలియదు కానీ. సంస్కృతము రాదు. ఆ మంత్రానికి అదే అర్ధమో? కాదో ? అంతకన్నా తెలియదు- ఎవరో `దీని అర్ధం ఇదట' అని చెపితే, ఇక ఆ మాట మీద , -చిలవలు - పలవలు - అల్లీ, `ఇవేమీ మంత్రాలు?'అంటువుంటారు . అలాంటి ప్రశ్నల వంటిదే ఇది కూడా.
స్త్రీ విలువైనది - అని ఇంతకముందు అనుకున్నాము . అందుకనే ఇన్ని పరీక్షలు. ఇత్తడి గిన్నెని కొనుక్కురావటానికి వేదిలోని సలహా అక్కరలేదు కానీ, బంగారము గొలుసు కొనుక్కొనేటప్పుడు మాత్రము పది మందిని అడిగి అడిగి కొనడం సరైనదే అని ఒప్పుకుంటాము కదా! అంతటి ఉత్తమురాలు స్త్రీ కావునా ఇంటికి తెచ్చుకునే టప్పుడు అంతగా ఆలోచించడం.
పరీక్షలని అన్నింటిని చేయటం చాలా తప్పు. - పురుషులు రాయడం వల్ల వచ్చుంటుంది - అనే వాదన మాత్రము సరిగాదు. సరికదా, ఏ కొందరిలో నున్న వివాహం పట్ల ఉన్నా విస్వాసభావాన్ని తొలగించటమే అవుతుంది కూడా.

Tuesday, May 5, 2009

వధువు ఎలా వుండాలంటే?

చిన్న తనం లో వివాహాలు చేయటమే సరియైన పద్ధతని ఆ రోజులలో వారు భావించేవారు. ఆనాటి కాలము, ఆలోచనా ధోరణీ, పెద్దల చెప్పు చేతలలో వినయంగా పడి ఉండడం వల్ల, ఈ నాటి వాలు అనుకునే విధముగా, చిన్నతనంలో తల్లులు కావడం వంటివి ఉండేవి కావు. అయినా కుడా ఆ కాలమో వాళ్లు జీవించినంత ఆరోగ్యంగా , ఇంత ఆలోచించి చేసుకునే
ఈ నాటి వాళ్లు ఉన్నారేమో ఆలోచించితే , అందరికీ నిజం తెలుస్తుంది.
వారి సారాంసం ఏమిటంటే, భర్తని గౌరవిచేడిగా కన్య ఉండాలని. భార్య ఆరోగ్యాన్ని గమనించి పిల్లల్ని కనేవాడు గా భర్త వుండాలి. అలాంటి కన్య ఔనా ? కాదా? అనే పరిశీలనా ఈ నలుగురూ చేయాలి. పాచీనపు ఆచారాలలోని సదాభిప్రాయాని గుర్తించాలి.

Friday, April 24, 2009

వధువు ఎలా వుండాలంటే?

అపూర్ణ దశవర్షామ్- పది సంవత్సారాలు నిండని కన్యని చేసుకోవాలని అపస్తంబుడంటాడు. ఈ విషయం ప్రస్తుత కాలానికి పూర్తిగా విరుద్ధము. అసలు ఎందుకు అలా అన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.
ఈరోజుల్లో లాగా పిచ్చి సినిమాలు- వెర్రి నవలలు లేని కాలము అది.మూడవ తరగతి పిల్లల నుండి ప్రేమలూ- పెళ్ళీళ్ళూ-స్త్రీలని అసభ్యంగా చిత్రీకరించటాలు తెలిసిన కాలమిది. ఆనాడు అటువంటి ద్యాసే వుండని రోజులు అవి.
అందుచేత, భర్తతోనే లోకం అనే అభిప్రాయాన్ని వాళ్ళకి కలిపించటానికి వీలుగా, ఊహ వచ్చిన కాలంలోనే పెళ్ళిళ్ళు చేసేవారు. వరుళ్ళు కూడా సంస్కారవంతముగానే , ఆరొగ్యప్రధమైన చదువులు చదివిన కారణముగా నియమనిబందనగానే ఉండేవారు తప్ప , స్త్రీ విషయంలో పాపపు ఆలోచనె కలిగి వుండేవారు కారు.
ఈ పది సంవత్సరాలు నిండని పిల్లకి చిన్నప్పటినుండే సంసారాన్ని చక్కదిద్దుకునేందుకు వీలైన విధంగా చెక్కతో చేయబడిన వంట పాత్రలూ, గరిటెలూ, ఇల్లూ- భర్తా- తల్లీదండ్రులూ-అత్తా మామలూ- నుయ్యీ -రోలూ -రోకలీ మొదలైన బొమ్మలు సమకూర్చేవారు. ( అవేనండీ లక్కపిడతలు అని అనేవారు) .
అంటే, అప్పటి నుండే గృహిణీ భాధ్యతని, బొమ్మలాటల ద్వారా నేర్పుతూ గుర్తుచేస్తూండేవారు.
తమకి ఓ ప్రత్యేకమైన అభిప్రాయాలు అంటూలేని వయస్సు పది సంవత్సరాలు వయసు కావున, సంసారాలు సజావుగా సాగిపోయేవి.
ఈమెకి ముప్పైఏళ్ళు వచ్చి, కొన్ని మహా స్థిరమైన అభిప్రాయాలు ఏర్పడ్డాకా, అత్యంత స్థిరమైన అభిప్రాయాలు ఆయనికి ఏర్పడ్డాకా, వీళ్ళిద్దరికీ, పెళ్ళి చేస్తే. ఎవరి మనోభిప్రాయాలు వాళ్ళవే, కలుసుబాటుతనం లేక రొజూ పామూ ముంగీస లాగా కాపురం చేయటమే ఔతొంది కదా, అయితే అందరూ ఇలా కాదులేండి. కొందరు ఇలా.
మిగతాది ఇంకోసారి చెప్పుకుందాము.

Thursday, April 9, 2009

పాటల సందడి _ రవి వర్మకి అందని

రవి వర్మకే అందని ...
Ravivarmake andani...


పల్లవి :
రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో (2)
రవి చూడని పాడని నవ్య రాగానివో ll రవి వర్మకే ll

చరణం :
రాగమో తీగదాటి ఒంటిగా నిలిచే
యోగమో నన్నుదాటి జంటగా పిలిచే
మూగ భావాలో అనురాగ యోగాలై..
.....
నీ పాటనే పాడనీ ll రవి వర్మకే ll

చరణం :
గగనమో కురులు జారి నీలిమై పోయే
ఉదయమో నుదుట చేరి కుంకుమై పోయే
కావ్య కల్పనలే నీ దివ్య శిల్పాలై ..
ఆ .. ..
కదలాడనీ పాడనీ ll రవి వర్మకే ll

చిత్రం : రావణుడే రాముడైతే ( 1979)
రచన : వేటూరి
సంగీతం : G. k. వెంకటేష్
గానం: S. P. బాలు, S. జానకి .
కవి రచన ఎంతో అందంగా వుంది . రవి వర్మ గొప్ప చిత్ర కారుడు అలాంటి చిత్ర కారునికే అందనంత గొప్పగా వున్న అందం గల ఆమెని వర్ణించుట చాలా బాగుంది . రచనా శైలి అద్భుతంగా అనిపిస్తుంది.

Tuesday, March 31, 2009

వధువు ఎలా వుండాలంటే ?


వధువు ఎలా వుండాలంటే :
అసమానర్షజాం : ఒక్కొక్క గోత్రం , ఏడుగురు ఋషులతో , మరొకటి ఐదుగురు ఋషులుతో ఇలా ఉంటుంది. సమాన ఋషుల గోత్రం కలది కాకూడదు.
ఋషులు సమానమైతే గోత్రము ఒకటౌటుందిగా. ఈ మాటనే అగోత్రజాం అని అన్నారు .
ఒక్కొక్క కన్య లేదా పుత్రుడు మరో ఇంటికి దత్తత పోతారు. అప్పుడు కన్నవారి, పెంపుడు వారి గోత్రాలు రెంటిలో ఏది మనకు వీలయితే అది గ్రహించకుడదు.
అసలు శాస్త్రం ప్రకారము దత్తత పోయిన గోత్రమే తన గోత్రముగా భావించాలి.
ఒకే గోత్రం వాళ్లు తప్పని సరిగా పెళ్లి చేసుకోవలసి వస్తే కొన్ని సందర్బాలలో దురదృష్టవశాత్తు సంభవిస్తే కనుకా (చమత్కారం) కొందరు ఇలా చేస్తున్నారు ( ఒక అరగంట దత్తు మంత్రాలు చదివిచేసి ఆమెని తాత్కాలికంగా దత్తత ఇచినట్లు , చేస్తారు అప్పుడు గోత్రం మారిపోతుంది కదా, ఇప్పుడు పెళ్లిని సగోత్రం కాని పిల్లతో పెళ్లి చేసినట్టు అవుతుంది .)
దత్తు ఇవ్వటం లేదని దత్తు తీసు కొనే వారికీ తెలుసు . దత్తు వెళ్ళటం లేదని దత్తు వెళ్లనని ఆమెకీ తెల్సు. ఈ జరుగుతున్నదత్తు తంతు అంతా అబద్ధమని అందరికీ తెలుసు . ఇంత అబద్దపు దత్తు ని పెళ్ళికి వచ్చిన వారి అందరిముందు చేసి శాస్త్రం ఒప్పుకుమ్టుందని భావిస్తే, ఇలాంటిదత్తు చేయిమ్చిన - చేసిన -వారి తప్పు కానీ ,
శాస్త్రం తప్పుకాదు.
దీని వెనుక రహస్యం అది ఒక Inevitable పెళ్లి . (బలవంతముగా చేసిన పెళ్లి అవుతుంది ట ) ఇది తప్పు.

Sunday, March 22, 2009

వధువు ఎలా వుండాలంటే? 2

ముందుగా మనం లక్షణవతీమ్ - యవీయయసమ్ - భ్రాతృమతీమ్ గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు
అసపిండామ్- ఒక్కోవధువు ఒక భాంధవ్యాన్ని బట్టి చూస్తే వివాహానికి వరస అయ్యి, మరో భాందవ్యాన్ని బట్టి చూస్తే చెల్లెల్లు వరస అవుతుంది. ఆమెని సపిండ అంటారు. అలా వరస భేధముతో వున్నా చేసుకోకూడదని అంటారు.
ఇప్పుడలా కాకుండా మార్చేసారు. అమ్మాయి నచ్చిందంటే వెంటనే వరసలు మార్చేస్తున్నారు. పెళ్ళి చేసేస్తున్నారు.
సరే తరువాత. అగ్రోతజామ్-అంటే వధువరులు ఇద్దరూ ఒకే గోత్రం కాకూడదు. అప్పుడు అప్పాతమ్ముళ్ళ వరస కానీ అన్నా చెల్లెళ్ళ వరుస అవుతుంది. వచ్చిన సంబందానికి వంకలు పెట్టుకుని చెడగొట్టుకుంటామా? అని చేసుకుని, తరువాత నూరేళ్ళూ భాధపడడం కంటే, ముందే జాగ్రత్త పడటం మంచిది.
బంధుశీల రక్షణ సంపన్నామ్- అంటే ఆ కన్యకి పెళ్ళి కాగానే ఈ ఇంటి కోడలు అవుతుంది కదా! ఆ సంబంధం వల్ల ఎందరో బందువులు అవుతారు.బందువు అయినవారందరూ మంచి గుణాలు కలిగివుండక పోవచ్చు. అలాటి సంధర్భములో‘ ఫలానీ ఆయన ఇలాగ- ఈయన ఇలాగ ’ అని బందువుల ప్రవర్తన - నడవడిక మొదలైన విషయాలలో వంకర ఎత్తి చూపేదిగా కాక, వాటిని గోప్యంగా ఉంచి. ఇంటి గుట్టు కాపాడేదిగా ఉండాలిట వధువు.
అరోగామ్- అంటే ధేర్ఘరోగాలు తో భాధపడేది కారాదు.
ఇంకా ఉన్నాయి తరువాత ఇంకో సారి వివరించగలను.

Thursday, March 12, 2009

వదువు ఎలా వుండాలి ?

లక్షణవతీం , యవీయసీం, భ్రాతృమతీమ్ , అసపిండామ్ అగోత్రజామ్ ,బంధుశీల రక్షణ సంపన్నా మరోగామ్, అసమానార్షజామ్, అపూర్ణదశవర్షాం కన్యాముద్వహేత్.
లక్షణవతీమ్- అంటే కన్య ‘లక్షణవతి’ కావాలిట. చూడగానే ‘కన్య’ అనిపించే సహజసిద్దమైన సిగ్గూ, ముగ్ధత్వం మొదలైన లక్షణాలూ, సాముద్రిక శాస్త్రం ప్రకారమ్ సరిపొయే కన్నూముక్కూతీరు కలది కావాలిట.శాస్త్రంలో చెప్పే లక్షణాలు ఉన్నది కేవలం దేవతలికే కాబట్టి, ఈ మాటకి అర్ధం ‘ ఎక్కువ లక్షణాలున్న కన్య’ అనేదే. ఇలా వయస్సుకి తగిన ముగ్ధత్వమూ- సిగ్గూ ఉండటం కన్యకి అందాన్నీ , మృదుత్వాన్నీ ఇస్తాయి. ఈ మద్య పిచ్చి పిచ్చి సినిమాలు పిల్లలను పాడుచేస్తున్నాయి. ఈ సినిమాలు వ్యక్తిలో ఉండే సున్నితపుతనాన్నీ, మృధుత్వాన్నీ పోగొట్టి వెకిలితనాన్ని వ్యక్తికి కలుగ చేస్తున్నాయి.
సరే ఇక యవీయసమ్ -అంటే ‘బలిస్ఠురాలు’ అని అర్ధం . వయసు చేత చిన్నది అని కూడా అర్ధం. బాగా బలం ఉండి, భర్తని ఒక్క గుద్ధుతో పైలోకాలకి పంపించే శక్తి కలదని కాదు.‘ సంతానము కలిగినటువంటి బలమూ- శక్తి కలది’ అని అర్ధం.
భ్రాతృమతీమ్ - అంటే సోదరులు వున్న కన్యని పెళ్ళిచేసుకోవాలిట. ఏదైనా అపార్ధం కారణంగా, వయసుచేత మామగారికీ, స్త్రీ అయిన కారణంగా అత్తగారికీ తెలియజెప్ప వీలు కానప్పుడు. కొన్ని సందర్భాలలొ ఈ కన్య భ్రాతృమతి (సోదరులు కలది) కాబట్టి, దాదాపు వయసు చెత సమానుడైన భావరిది చెప్పుకొని, సమస్యకి పరిష్కారమును సులభముగా సాధించవచ్చు కదా!. అందుకే అలా అన్నారు.
మిగతాది తరువాత.

Monday, March 9, 2009

వధు - వర Bio - Data

వరుని దగ్గరనుండి బయలు దేరిన, ఆ నలుగురు కన్యాదాతల దగ్గరకు వెళ్తారు. అక్కడ ఇలా అంటారు.

చతు స్సాగారపర్యంతం గో బ్రాహ్మణేభ్య శ్శుభం భవతు-
అంగీరస బార్హస్వత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత యజుర్వేదినే -
తైత్తిరీయ శాఖాధ్యాయినే , ఆపస్తంబ సూత్రిణే రామ శర్మణో నప్త్రే, పేరేశ్వర శర్మణ: పౌత్రాయ,
వేంకటేశ్వర శర్మణ: పుత్రాయ, చంద్రశేఖర శర్మణే వరాయ
భవదీయాం కన్యాం ప్రజాసహత్వ కర్మభ్యో వ్రణీమహే l

మూడు ఋషులు అధిస్ఠాతలుగా ఉన్న భరద్వాజునితో సమానమైన గోత్రం కలవాడూ, యజుర్వేదాన్ని అభ్యసించినవాడూ, ఆ వేదము ప్రకారము తన ఇంటి కార్యక్రమాలను నడిపించువాడూ,( శుభాశుభాలు రెండింటినీ), తైతరీయ శాఖనీ, అపస్తంబ సూత్రాన్నీ అభ్యసించి, అనుసరించేవాడూ, రామ శ్రర్మగారి మునిమనుమడూ, పేరయ్యగారి మనుమడూ, వేంకటేశ్వర్లు గారి పుత్రుడూ అయిన చంద్రశేఖరుడు అనే వరునికి, వధువు ను అడుగుటకు వాచ్చాము అని వాళ్ళు అంటారు.

ఇది, పిల్లవానికి సంబంధించిన పూర్తి వివరం. నేడు అదే Bio - Data అని చదివే విధానం, ఆనాటి నుండీ ఉన్నదే తప్పా, వేరేదే కాదు. ఇలా వివరాలు చెప్పడం వలన, కన్యాదాత ఆలోచించుకునే అవకాశం ఉంటుంది. ఇవేమీ తెలియక పోతే - ఫలాని వాని మనుమరాలని తెలియక చెసుకున్నాం - అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నాము . అని ఇలాంటి మాటలు పుడతాయి. ( మనం కూడా ఇలాంటివి తరచుగా వింటూనే వుంటుంన్నాము కదా).

కన్యాదాత, వరుని ముత్తాత దగ్గర నుండి వివరాలు వింటాడు. ఆ సంబంధం తనకి ఇస్టమైతే, వెంటనే తన వధువు (కూతురు) వివరాలు కూడా పైవిధముగానె చెప్తారు.

Sunday, March 8, 2009

మీ ప్రయాణం సుఖకరము అగుగాక !

వరుడు ఆ రోజుల్లో పెళ్లికుతురుని వెతకటానికి వెళ్ళే నలుగురితో ఇలా అంటాడు. మీ ప్రయాణము సుఖకరముఅగు గాక !(Wish you a happy journey!) అని ఈ రోజులలో అనేమాటనే నాటి ఋ గ్వేద కాలమునాటి మాట.
" ప్రసుగ్మంతా ధియసానస్య సక్షణి వరేభి ర్వరాగ్o అభిషు ప్రసీద l
అస్మాకమింద్ర ఉభయం జుజోతి l యత్సౌమ్య స్యాంధసో బుబోధతి l
అనృక్షరా జవ స్సంతు పన్దా యేభి స్సఖా యో యాన్తి నో వరేయం l ..............
అని ఇలా వుంటుంది మంత్ర రాజము.

ఓ ! స్నేహితులారా ! వేగము కలవారై , బుద్ధిమంతులై, నా మనసు తెలిసినవారై న మీరు సంతోషముగా బయలుదేరి వెళ్లవలసినదిగా మిమ్ములను ప్రార్ధిస్తున్నాను. వరుడు, వధువు అలాగే వీళ్ళిద్దరికీ వివాహమైతే, ఆ వివాకాలము లో ఇచ్చే" హవిస్సు "అగ్ని గుండములో మంత్రాలతో వేసే నెయ్యి ఇంద్రునికి కుడా లభిస్తుంది కాబట్టి , ఆ ఇంద్రుడు కుడా మీకు సహాపడుతూ అలా నాకు కుడా సహాయపడతాడు. మీరు వల్లలేని దారులలో కుడా ఎవిధమైనా రాళ్ళు రప్పలు , పల్లేరుకాయలు లేకుడా ఉండాలని, దారి తిన్నగా వుంది, మీ ప్రయాణం సుఖంగా సాగాలని కోరుకుంటున్నాను.
అని వరుడు వెళ్ళే నలుగురి తో అంటాడు.

ఆర్యముడు, భగుడు అనే పేరుగల దేవతలు కుడా, మీకు సహాయ పడవలెనని ప్రార్ధిస్తున్నాను, మీ ప్రయాణము సులభ,సుఖకరమై, ఫలవంతము అగుగాక! అని పలుకుతాడు.
రోజు లలో అలాంటి పద్దతులు లేవులేండి. online లో పెళ్లి సంబందాల సైట్లకు డబ్బులు కట్టేసి అమ్మాయా photos చూడటం నచ్చితే ఫోన్ తో సరాసరి మాటలాడటం. అన్నీ short cut పాద్దతులే కదా.
ఎంతో మర్యాదా, పధ్ధతి తెలుస్తాయి . వేదం చదివితే- లేదా - వేదార్ధం విన్నా . దాన్నే నిత్యం మననం చేస్తే సత్ హృదయం లభిస్తుంది.

Friday, March 6, 2009

కన్యని వరించటం ఎలా? (2)

కన్యని వరించటం :
నలుగురిని పంపటంలో కుడా ఒక విషయం వుంది. పూర్వులు కుడా ఎప్పుడు "సరి సంఖ్య " ఆదరించేవారు. గృహానికి ఉండే కిటికీలు, ద్వారాలు, అన్నీ సరి సంఖ్యలోనే ఉండాలని. సృష్టిలో ఏది ఒక్కగా వుండరాదని. అన్నీ జంటగా వుండాలని వాళ్లు అనుకునేవారు.
లోకంలో కుడా " నలుగురు నడిచేదారి , పదిమందిని పిలుచుకోవాలిగా! - వంద అబద్దలాడినా - వెయ్యి చెప్పినా నీ మాట వినను " అనేతతువంతి సామేతలులో కుడా బేసిసంఖ్య లేదు. గమనించారా. ఎ కార్యక్రమానికైనా పురోహితులు ఒక్కరే అయితే, వివాహానికి మాత్రం ఇద్దరు వుంటారు. వధువు వైపునుండి ఒకరు, వరుడు వైపునుండి ఒకరు పురోహితులుంటారు. అనావసరంగా ఇద్దరు బ్రాహ్మణులకు డబ్బులు ఇవ్వటం ఎందుకని , ఒకరిని చేసి - ఏది వద్దంటే అది చేయటం నేటి సాంప్రదాయము.
తరువాత తేడాలు వస్తే, మంత్రాలు - తంత్రాలు అన్నీ అబద్దాలే అనటం మనకి మామూలే కదా.
నలుగురిని పంపడంలో ఒక విశేషం వుండను కున్నాము కదా అదేమిటంటే , " ఎన్నిక" సమస్య ( voting system) రారాదని. కొన్ని కొన్ని సమస్యలు వచ్చినపుడు మేధావులు కొందరు voting పెడతారు. వెళ్ళేది ఐదుగురనుకుందాము . ఎవరో ఓ లంఖిని బాగుందని ముగ్గురు అంటే , చచ్చినట్లు వాడికి కట్ట బెట్టవలసిదే కదా. అప్పుడు ఆ పిల్లాడి పరిస్తితి ఏమైపోతుంది . అందువల్ల పెళ్లి వంటివాటికి ఓటింగు పరిస్థిటి కుదరదు.
అందుకే వేదం చెప్పింది.
"హితకారిభి రే వాసౌ జ్ఞాయమాన ప్రవర్తకః
హితకారిభి: భిగ్భి: జ్ఞాయమాన స్సన్ రోగీ "
అని. దానిలో అర్ధం తెలియాలి.తిండి తినకుదని రోగం వచ్చింది ఒకడికి. వందమంది అతనిని చూడటానికి ఒచ్చారు రోగికదా. తొంభై తొమ్మిది మంది తిండి పెట్టకూడదు అని అన్నారు. పోనీ ఏభైఒక మంది తిండి తినకూడదు అన్నారు . మరి అలాగే voting ప్రకారము తిండి పెడితే రోగి హరీ అని అనడా? ఎక్కువ మంది ఏది అంటే అది అమలు చేసేసి న్యాయం చేసాము అని అనుకోకుడదని వేదం చెబుతోంది.
అందుకని, నలుగురికి ఒకే నిర్ణయం కలిగితేనే వధువు నచ్చినట్లు . అంటే కానీ 3+1 అనే సిద్దాంతం ద్వారా ఒకడు కాదు అని , సంసారం కూలిన ప్రతి పక్షంలో కూచొని, నేను ముందే చెప్పాను విన్నారా? అనటం సరి అయినది కాదు.

Thursday, March 5, 2009

కన్యని వరించటం ఎలా? (!)

కన్యని వరించటం :
చాలా మంది అనుకుంటున్నారు నవలలోని , ఏవో సినిమాలాల్లోలా, రోడ్లమీద జులాయిలా తిరుగుతూ ప్రేమని నటించుతూ ఉండటమే వరించటము అని . కానీ ప్రాచీనుల ద్రుష్టి ఎంత దూరమో , ఎంత గంభీరంగానో ఉంది.

" సుహృదస్సమవేతాన్ మంత్రవతో పరాన్ ప్రహిణుయాత్ " పెళ్లి చేసుకోబోయే వరుణ్ణి బాగా ఎరుగున్నవాళ్ళు, ధర్మబుద్ధితో కూడిన ఆలోచన కలవాలు అయిన నలుగురికి తాంబులాలనిచ్చి, కన్యని వెతుక్కుని రమ్మని పంపించాలిట .

వరుడే ఎందుకు పోరాదని ప్రశ్న. యవ్వనంలో ఉంది పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే ఉన్న వరుడు "కన్యావరనానికి " వెళితే
సుర్పనఖని ముస్తాబు చేసి `సీతమ్మ" లా కూచో బెడితే ! -ఆమెనే పెళ్ళాడుతా అని మొండికేస్తే. ఆమ్మాయి గుణగణాలు తెలుసుకునే వయస్సు కాదు. లేదా కన్యలని చూస్తూ ఉండడాన్ని ఒక వినోదంగా( కొందరున్నారు ఇలాంటి వారు) భావిస్తూ వివాహానికి ఏ అమ్మాయినీ నిర్ణయించుకోలేకనూ పొవచ్చు.
అందుకనే, వౌని గుణగణాలుని ఎరుగున్నవాళ్ళే పోవాలి, ఆ కన్య లక్షణాలు చుచి, ముందు బౌతికంగానూ (అంటె పొడుగూ పొట్టి- లావు సన్నము - చాయావంటివి) ఆ మేదట, ఎరుగున్నవాళ్ళు ద్వారా ఆమె గుణగణాలుని తెలుసుకు, ఇద్దరికీ పొతనని ( జాతకాలు వగైరా ) నిర్ణయిస్తారు. వరుడు కోపస్వభావి కలవాడు అని తెలిసిన వీళ్ళు , ఆమె గుణగణాల్ని విచారించి, ఆమె కూడా అలాంటిదే అని విచారణమీద తెలిస్తె, సంబందాన్ని విరమిస్తారన్న మాట. ఇద్దరు ఒకలా ఉంటె రోజూ ఆ ఇంటి వాతావరణం యుద్దభూమిని తలపిస్తుంది కదా మరి అందుకే, అందుకే వివాహ నిర్ణయం చేయటానికి ధర్మబుద్ది, సరియైన అలోచనా కలిగిన వాళ్ళని పంపడం జరుగుతుంది.

Tuesday, March 3, 2009

వివాహానికి ముందు ఏమి చెయ్యాలి ?

ఏదైనా ఒక ఇల్లు కట్టాలంటే దానిక్కవలసిన ముడి పదార్ధాలు సిద్ధము చేసుకున్నట్లు, వివాహానికి ముందు కూడా యోగ్యురాలైన కన్యని పరీక్షించి నిర్ణయం తీసుకోవాలి అని శాస్త్రం చెబుతున్నది. దాన్నే కన్యా వరణం (కన్యని ఎన్నుకోవటం -కన్యని ఎన్నుకోవటం) అని అంటారు.
ఇది పెళ్ళికి ముందే జరిగేది అయినా, ఈ జరిగే పెళ్ళికి ఆధారభుతులు కన్యని వెదికి వెదికి పరీక్షించి తెచ్చేవాళ్ళు కాబట్టి, వాళ్ళని వివాహానికి వచ్చిన బందువులకి పరిచయం చేయటం కోసము పెళ్ళిలో ఒక ఘట్టం గా చేసారు. పెళ్లి కూతురుని తెచ్చే గంపని మేదరి సిద్ధం చేస్తాడు. ఆ మేదరికి సన్మానం జరుగుతుంది. ఇదే పెళ్ళిలో కుమ్మరి, వివాహానికి కావలసిన కొత్త కుండలను సిద్ధము చేస్తాడు. అతనికి సన్మానం చేస్తారు ఈ పెళ్ళిలోనే . వధువు మెడలోని తాళి బొట్టును చేస్తాడు కంసాలి. అతనికి అక్కడే సన్మానం చేస్తారు. అలాగే ఇత్తడి చెంబుల్ని ( కలశాలను) చేసినకమ్మరి కి , పందిళ్ళు వేసిన చాకలికి, అలాగే తలంబ్రాలు బియ్యం తేవటం తో పాటు ఇతర పనులు చేసినటువంటి ఇంటి చాకలికి, మంగల వాయిద్యాలు వాయించిన మంగలి( అందుకే వారికి ఆపేరువచ్చింది) . కాలిగోళ్ళు తీసిన మంగలికి కుడా ఆ వివాహ వేదికమీడనే సన్మానం చేస్తారు. ఆ రోజుల్లో ఇలా ఇన్ని కుల్లాల వారికి ఒకే వేదిక మీద ఓ మంచి వివాహం లోమంగల వాయిద్యాల మద్య సన్మానం జరుగుతున్నా కారణంగా- ఎక్కువ తక్కువ కులాలు అన్నా తేడ లేకుండా ఆ ఇంటి పురోహితుడు అందరికీ సమానంగా సన్మానం జరిగే టట్టు చూస్తాడు. అలాంటప్పుడు కుల ప్రసక్తి లేకుండా వివాహ వేడుకలో ఈ సన్మానం అన్నది ఒక పరిచయ వేడుకలా జరుగుతుంది.
ఇవి ఆ రోజులలో జరిగేవి ఇప్పుడు ఆ పద్దతులే లేకుండా చాలా మార్పులు చేర్పులు జరిగాయి. పెళ్లి తొందరగా జరిగిపోవటం. ఢేకరేషనులు , ఫోటోలు వీటిమీదే ద్యాస మారిపోయింది కాని ఈ పరిచయాలు జరిగే విదానంలు మారిపోతున్నాయి.

Friday, February 27, 2009

అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలి ? (పెళ్లి చేసుకోనివాని కదా)

శ్రీ మహాభారతములో జరత్కారువు అనే పేరుగల ఒక మహారుషి కలదు. అతడు ఏది ఏమైనా సరే తను పెళ్లి చేసుకోనని భీష్మించుకొని ఉండిపోయాడు. ప్రతీదినము లానే ఆ రోజు కుడా తప్పస్సు చేసుకోటానికి పోతుంటే. ఒక పాడు బడ్డ బావిలో సన్నని మూలుగులు వినబడ్డాయి వాటిని విన్న జరత్కారువు ఆ భావిలో తొంగి చూచాడు . ఆ బావి చాలా లోతుగా ఉంది అందులో ఎందరో మహారుషులు , ఆ నూతిలో పెరిగిన చెట్టు ఉదాలని పట్టుకొని తలక్రిందులుగా వేలాడుతున్నారు.
జరత్కారువుకి ఆనందం వేసింది. ఇలా తలక్రిందులుగా వేలాడుతూ తపస్సు చేయటం, కఠోర తపస్సు అవుతుందేమోనని ఆనందించి, వాళ్ళతో ఇలా అన్నాడు, స్వామీ! ఇది ఏ తపస్సు? అని .
వాళ్లు బాధ పడుతూ "నాయనా! ఇది తపస్సు కానే కాదు. మా వంశంలో జరత్కారు వనే ఒక దుర్మార్గుడు , వివాహం చేసుకోనని భీష్మించుకొని ఉండిపోయాడు. వాడు వివాహం చేసుకు సంతానాన్ని కన్నా పక్షములో తప్ప మాకు మోక్షము ఉండదు. మోక్షము రాదు కాబట్టి- ఇదిగో- అధమ లోకాలకి పోతున్నాము. నీకు ఎక్కడైనా ఆ వ్రాత్యుడు (ముర్కపు పట్టుదల కలవాడు) కనిపిస్తే చెప్పి మమ్మల్ని ఒడ్దేక్కిమ్చి ఊర్ద్వాలోకాలకి పోయే పద్దతిని కలిపించు" అన్నారు.
ఆశ్చర్యపడ్డ జరత్కారువు వాళ్ళతో -" అయ్యా" నేనే ఆ శఠుణ్ణి . క్షమించండి . మిమ్ములను ఊ ర్ద్వాలోకాలకి పంపే ఏర్పాటు నేనే చేస్తాను. నా తపస్సు నాకు చాలు అనుకున్నాను గాని- ఇది నాకు తెలియనిది- అంటు వెళ్ళిపోయి, తనకు వివాహము కావని ఉందని అందరితో చెప్పాడు.

పట్టుదలున్నవాడికి, ఆ పట్టుదల అనేది, ఏదో సమయంలో కొంత తగ్గినా, మళ్ళీ రాక మానదు. అలాగే, వివాహం చేసుకునే స్థాయికి జరత్కారువు దిగినా తన పేరే కల కన్యనే, వివాహం చేసుకుంటానన్నాడు. ఈ రోజుల్లో అయితే మరుక్షణంలో అలాంటి పేరు కలవారు వుండెవారు. కానీ ఆ కాలంలో అలాకాదు. వెతికారు వెతికారు ఎంతకీ అలాంటి పేరు కల అమ్మయే దొరకలేదు చివరికి వాసుకి అనె పాము చెల్లెలి పేరు అదే అయ్యింది. మొత్థనికి వివాహం అయ్యింది. వాళ్ళకి ఆస్తికుడు అనే మహాఋషి కలిగాడు. జనమేజేయుని తండ్రి పరీక్షిత్తు. సర్పం కరచి చనిపోతే , లోకంలో సర్పాలే ఉండరాదని వాటిని చంపేందుకు సర్పయాగం ను జనమేజేయమహారాజు ప్రారంభిస్తే ఆపి , సర్పాల ని రక్షించింది. ఈ మహఋషే అందుకనే, పాము కంపిస్తే `ఆస్తిక! ఆస్తిక! అని అనవలసిందని, పెద్దలనేవారు. పాములకి రక్షచేసినవాడు కదా! అని . ఆ కధ అలా సాగి వెళ్ళిపోయినది.

ఈ ఆస్తికుణ్ణి కన్న కారణంగా ఆ బావిలో ఉన్న వారందరికి ఊర్ద్వ గతులు కలిగాయి. పితృ ఋణం తీరిందన్నమాట. మరి సన్యాసుల మాట ఎలా?
అంటె, ఆ తండ్రికున్న పుతృలలో ఏ ఒక్క పుత్రుడు వివాహం చేసుకున్నా చాలును. అంతా సన్యసించరు కదా.
భారతంలో బీష్ముడు ఇలా ప్రతిజ్ఞ చేసాడు కదా! మరి పితృఋణం ఎలా తీరింది? అంటే.
`భ్రాతౄణా మేకజాతానాం ఏకశ్చేత్ పుత్రబాంధవే -
సర్వేతే నైవ పుత్రేణ , పుత్రిణో మను రబ్రవీత్ '
అని ప్రమాణ వచనం.
తన తండ్రికి ఉన్న పుత్రులలో , అంటే, తన సోదరుల్లో ఏ ఒక్కరికి సంతానం ఉన్నా, పితృ, పితామహులకి ఊర్ద్వలోకాలు కలుగుతాయని శాస్త్రము చెప్పింది.
భీష్ముని సోదరునికి సంతానం ఉందికదా. సోదరుని తాత ఎవరో, తనకి తాత అతడే కదా! అందుకని పితామహులు పతితులు కారని, ధర్మశాస్త్రము లో మనువు చెప్పడు.

Thursday, February 26, 2009

అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలి ?


`జాయమానో వై బ్రాహ్మణ స్త్రిభి ఋణ వా జాయతే
బ్రహ్మచర్యే షిభ్యో 11 యజ్ఞేన దేవేభ్యః 11 ప్రజయా
పితృభ్య షవా 2 నృణో యః పుత్రే యజ్వా'
అని వేదం చెప్తోంది .ప్రతీ మనిషి పుడుతూనే, `మూడు' ఋణాలతో పుడతాడట. అవి ఋషిఋణం , దేవ ఋణం, పితృ ఋణం అనేవి. చేసిన అప్పు తీర్చాలి కదా మరి .
ఈ మూడు ఋణాలు తీర్తేనే అతడు ధర్మ పరుడన్నమాట. వీటిలో పితృ ఋణం తీరాలంటే, పెళ్లి చేసుకోవాలి. తీర్చుకునే విధాలు ఏమిటి ?
మొదటిది ఋషి ఋణం . నిస్వార్ధముగా ఋషులు రామాయణ-భారత-భాగవతాలు రాసారు. వాటిని అధ్యయనం చేస్తే ఋషి ఋణం తీరుతుంది. చదివి అర్ధం చేసుకోగల పాండిత్యం లేనివాళ్ళు, పదిమంది చదువుకునేలా ఉపన్యాసాలు చెప్పించడం- గ్రంధ ప్రచురణం- హరికధలు మొదలైన వాటి ద్వారా ప్రచారం చేసినా ఋషి ఋణం తీరుతుంది.
రెండవది దేవ ఋణం, వాళ్ళని ఆరాధిస్తూ యాగం చేస్తే, యాగం చేసే శక్తి లేకపోతె చేసేవారికి సహకరించినా ఆ ఋణం తీరుతుంది.
మూడవది పితృ ఋణం. వివాహం చేసుకుని సంతానాన్ని కానీ, గాలికి అలా వదిలి వేయకుండా ప్రయోజకుల్ని చేసి, -`ఫలాని వారి పిల్లలు'- అనే విధముగా చేసుకుంటే పితృ ఋణం తీరుతుంది. అందువల్లే వివాహ వ్యవస్థ ఏర్పడింది .

Thursday, February 19, 2009