Friday, March 6, 2009

కన్యని వరించటం ఎలా? (2)

కన్యని వరించటం :
నలుగురిని పంపటంలో కుడా ఒక విషయం వుంది. పూర్వులు కుడా ఎప్పుడు "సరి సంఖ్య " ఆదరించేవారు. గృహానికి ఉండే కిటికీలు, ద్వారాలు, అన్నీ సరి సంఖ్యలోనే ఉండాలని. సృష్టిలో ఏది ఒక్కగా వుండరాదని. అన్నీ జంటగా వుండాలని వాళ్లు అనుకునేవారు.
లోకంలో కుడా " నలుగురు నడిచేదారి , పదిమందిని పిలుచుకోవాలిగా! - వంద అబద్దలాడినా - వెయ్యి చెప్పినా నీ మాట వినను " అనేతతువంతి సామేతలులో కుడా బేసిసంఖ్య లేదు. గమనించారా. ఎ కార్యక్రమానికైనా పురోహితులు ఒక్కరే అయితే, వివాహానికి మాత్రం ఇద్దరు వుంటారు. వధువు వైపునుండి ఒకరు, వరుడు వైపునుండి ఒకరు పురోహితులుంటారు. అనావసరంగా ఇద్దరు బ్రాహ్మణులకు డబ్బులు ఇవ్వటం ఎందుకని , ఒకరిని చేసి - ఏది వద్దంటే అది చేయటం నేటి సాంప్రదాయము.
తరువాత తేడాలు వస్తే, మంత్రాలు - తంత్రాలు అన్నీ అబద్దాలే అనటం మనకి మామూలే కదా.
నలుగురిని పంపడంలో ఒక విశేషం వుండను కున్నాము కదా అదేమిటంటే , " ఎన్నిక" సమస్య ( voting system) రారాదని. కొన్ని కొన్ని సమస్యలు వచ్చినపుడు మేధావులు కొందరు voting పెడతారు. వెళ్ళేది ఐదుగురనుకుందాము . ఎవరో ఓ లంఖిని బాగుందని ముగ్గురు అంటే , చచ్చినట్లు వాడికి కట్ట బెట్టవలసిదే కదా. అప్పుడు ఆ పిల్లాడి పరిస్తితి ఏమైపోతుంది . అందువల్ల పెళ్లి వంటివాటికి ఓటింగు పరిస్థిటి కుదరదు.
అందుకే వేదం చెప్పింది.
"హితకారిభి రే వాసౌ జ్ఞాయమాన ప్రవర్తకః
హితకారిభి: భిగ్భి: జ్ఞాయమాన స్సన్ రోగీ "
అని. దానిలో అర్ధం తెలియాలి.తిండి తినకుదని రోగం వచ్చింది ఒకడికి. వందమంది అతనిని చూడటానికి ఒచ్చారు రోగికదా. తొంభై తొమ్మిది మంది తిండి పెట్టకూడదు అని అన్నారు. పోనీ ఏభైఒక మంది తిండి తినకూడదు అన్నారు . మరి అలాగే voting ప్రకారము తిండి పెడితే రోగి హరీ అని అనడా? ఎక్కువ మంది ఏది అంటే అది అమలు చేసేసి న్యాయం చేసాము అని అనుకోకుడదని వేదం చెబుతోంది.
అందుకని, నలుగురికి ఒకే నిర్ణయం కలిగితేనే వధువు నచ్చినట్లు . అంటే కానీ 3+1 అనే సిద్దాంతం ద్వారా ఒకడు కాదు అని , సంసారం కూలిన ప్రతి పక్షంలో కూచొని, నేను ముందే చెప్పాను విన్నారా? అనటం సరి అయినది కాదు.

No comments: